Anantapur

Jan 19 2024, 06:50

హై టెన్షన్ తెర దింపిన జగనన్న.. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు..

జగనన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి...

సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తగా యం. వీరాంజనేయులు(మాదిగ)సామాజిక సమీకరణలో భాగంగా.. శింగణమల మండలం సి. బండమీద పల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు(మాదిగ)ను సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది.

ఎమ్మెల్యే దంపతుల సహకారంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన సమన్వయకర్త ఎంపిక.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పును స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యం. వీరాంనేజియులను జగనన్న సమన్వయకర్తగా నియమించడం హర్షిస్తున్నామన్నారు. సమన్వయకర్తగా నియమించిన యం.వీరాంనేజియులుకు సహకరిస్తామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. 

సమన్వయకర్తగా ఎంపిక చేసిన జగనన్నకు రుణపడి ఉంటాము: యం. వీరాంజినేయులు (మాదిగ)*

సామాజిక సమీకరణలో భాగంగా శింగణమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనను ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వం విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేస్తానన్నారు. 

తనను సమన్వయకర్తగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Anantapur

Jan 18 2024, 07:53

Breaking...విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు దుర్మరణం.. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

అనంతపురం జిల్లా నార్పల మండలం నరసాపురం గ్రామ సమీపంలో హెచ్ ఎల్ సి కెనాల్ దగ్గర జంగారెడ్డి పల్లి దారి నందు

తెల్లవారుజామున తండ్రి భయపరెడ్డి 36 సంవత్సరములు కొడుకు రాజారెడ్డి 17 సంవత్సరములు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు

ఈ ఇరువురు తమ పొలానికి నీళ్లు అందించడానికి వెళ్లి కొడుకు రాజారెడ్డి మోటర్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ కు గురైన వెంటనే తండ్రి భయపరెడ్డి రక్షించాలని వెళ్లి ఒకరికొకరు విద్యుత్ షాక్ ప్రమాదానికి గురై అక్కడే మరణించారు శోకసముద్రంలో కుటుంబ సభ్యులు

Anantapur

Jan 17 2024, 17:09

హెల్తీ గ్రామపంచాయతీ.. నేషనల్ వర్క్ షాప్ ఎంపీ కైన.. నీలం భాస్కర్ బుక్కరాయసముద్రం మండలం

హెల్తీ గ్రామపంచాయతీ.. నేషనల్ వర్క్ షాప్ లో పాల్గొననున్న జడ్పిటిసి నీలం భాస్కర్..

తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రేపు అనగా 18-01-2024 - 19 -01-2024 తేదీల్లో రెండు రోజుల పాటు హెల్తీ గ్రామపంచాయతీ..

నేషనల్ వర్క్ షాప్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తరుపున బుక్కరాయసముద్రం మండలం జడ్పీటీసీ నీలం భాస్కర్ ఎంపిక చేశారు.

ఈ నేషనల్ వర్క్ షాప్ కి పలు రాష్ట్రాల నుంచి జిల్లా అధికారులు మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Anantapur

Jan 17 2024, 12:19

బుక్కరాయసముద్రం గ్రామంలోని జగనన్న లే అవుట్ 6 లో 47వీధి దీపాలు వెలిగేనా.. సిపిఎం
విద్యుత్ కనెక్షన్ పై అవగాహన ఉన్న అధికారులేనా ! వీధి దీపాలు వేసింది 70 కు పైగా వెలుగుతున్నవి 23* *వెలగనివి 47* *వృత్తి నైపుణ్యం అంటే ఇదేనేమో* *కరెంట్ లేని లైన్ లకు వీధి దీపాల కనెక్షన్ ఇస్తే వెలుగుతాయా* *స్తంభం నెంబర్ 173 నుండి 172,171,170 వరకు ఉన్న స్తంభాలకు కాసారాలకు పింగాణీ లేక వైర్లు వేలాడుతున్న పట్టని అధికారులు.* *విద్యుత్ అధికారుల వైఫల్యమా* *పంచాయితీ నిర్వహణ వైఫల్యమా* *మండల కేంద్రమైన బుక్కరాయసముద్రం గ్రామపంచాయితీ పరిధిలో లేఅవుట్ నెంబర్ 6 లో దాదాపు 800 కు పైగా ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. ఇల్ల నిర్మాణాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వము ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తున్నది.* *అందులో భాగంగా లేఅవుట్ నంబర్ 6 నందు నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి దాదాపు 150 పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.* *వీటికి పంచాయతీ వీధి దీపాలను ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా అయింది.* *వీధిదీపాలలో 47 కు పైగా వెలగని పరిస్థితిలో ఉన్నాయి.* *కారణం విద్యుత్ అధికారులు పంచాయితీ అధికారుల వైఫల్యమా, విద్యుత్ అధికారుల వైఫల్యమా? ఎవరనేది తెలియక ప్రజలు రాత్రి పూట వెలుగులు చూడలేక పోతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి నాలుగు ఫేస్ కనెక్షన్లు ఒక న్యూటన్ లైన్లతో ఏర్పాటు చేశారు.* *ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు ఫేసులకు మాత్రమే కనెక్షన్ ఇచ్చారు.* *ఒక ఫేసుకి కనెక్షన్ ఇవ్వకపోవడం వాటికే వీధి దీపాల కనెక్షన్ ఇవ్వడం అధికారుల పని తీరు శహబాస్ అవురా అని ముక్కున వేలేసుకుంటున్నారు. వీథి దీపాల వెలగకపోవడానికి కారణాలు దొరకడం లేదు.* *విద్యుత్ అధికారులు నాలుగో ఫేస్ కూడా విద్యుత్ కనెక్షన్ ఇస్తే తప్ప ఆ వీధి దీపాలు వెలగవు.* *మొత్తం వీధి దీపాలన్నీ నిత్యము వెలగడం కూడా జరుగుతుంది.* *ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల పంచాయితీకి వీధిదీపాల విద్యుత్ కరెంటు భారంగా మారుతుంది.* *అలాగే 173, 174 స్తంభాల దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుండి తూర్పు వైపున 172,171,170 స్తంభాల మధ్య కాసారాలపై ఉండాల్సిన పింగాణి లేకపోవడం వల్ల విద్యుత్తు లైన్లో క్రింద వేలాడుతున్నాయి. ఈ విషయమై సిపిఎం మండల నాయకులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరం.* *283 స్తంభం కు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ ఉన్న ఇళ్లకు స్తంభాలకు తీగలు లాగ లేదు. దీనివల్ల ఇల్లు నిర్మించుకుంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.* *తక్షణం గ్రామ పంచాయితీ అధికారులు స్పందించి విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకొని వీధి దీపాలు వెలిగేటట్లు, పింగాణీలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించాలని 283 స్తంభం కు ఏర్పాటు చేసిన నాలుగోవ ట్రాన్స్ఫార్మర్ వద్ద నుండి మిగిలిన అన్ని సందులకు విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్. కుళ్ళాయప్ప కోరారు.*

Anantapur

Jan 17 2024, 10:28

శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు గా కాయల సురేష్ యాదవ్..
తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు* గారి ఆదేశాల మేరకు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ గార్ల* చేతులమీదుగా *శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు గా కాయల సురేష్ యాదవ్ నియామకం పత్రాన్ని* ఈరోజు అనంతపురం పార్లమెంట్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా తెలుగు యువత అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు జగన్నాథ్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకం ప్రతి ఒక్క యువ ఓటర్లను ఓటర్లుగా చేర్పించి ఆ ఓటర్లను చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, శింగనమలనియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, దండు సతీష్ రాయల్, దండు ప్రకాష్,ఐటిడిపి చాంపియన్ ముని,బాబావలి, మహ్మద్* తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 17 2024, 07:37

ఆదర్శ కవికి ఆత్మీయ సన్మానం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ

ఆదర్శ కవి ఎన్నో అవార్డులు గెలుచుకున్న అవార్డు గ్రహీత

మన నార్పల మండల నివాసి శ్రీ వల్లెపు వెంకట సాయినాథ్ గారికి గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్

శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు

ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది

Anantapur

Jan 17 2024, 07:18

గుడి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం

సిద్దారంపురం గ్రామంలో నూతనంగా సొంత ఖర్చుతో నిర్మిస్తున్న

శ్రీ విశాలాక్షి అమ్మవారి గుడి నిర్మాణ పనులను పరిశీలించిన

జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

Anantapur

Jan 14 2024, 09:44

ముగిసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం.. క్రికెట్ ఫైనల్ లో సచివాలయం వన్ 35 పరుగులు తేడాతో ఘనవిజయం
ఆడుదాం ఆంధ్ర కోకో, వాలీబాల్, కబడ్డీ, బాడ్మింటన్, పురుషుల, మహిళల బుక్కరాయసముద్రంమండల స్థాయి ఆటల పోటీల సందర్భంగా ఈరోజు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ బి.కే.ఎస్-1, బి.కే.ఎస్-4 జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి గ్రామ సర్పంచ్ పార్వతి, నీలం భాస్కర్ జెడ్పిటిసి, ముఖ్య అతిథులుగా తెజ్యోష్ణ ఎంపిడిఓ, లక్ష్మీనారాయణ ఎంపీటీసీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ స్థాయి నుండి నిర్వహించిందని దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను వెలుపలకు తీసి రాష్ట్రస్థాయి వరకు తీసుకెళ్లి తదుపరి శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగేటట్లు చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి సజావుగా జరిగేటట్లు చూడాలని ఓటమి అయినా గెలుపైన సమానంగా స్వీకరించాలని ఇరుజట్లకు క్రీడాభినందనలు తెలియజేసి రాష్ట్రస్థాయి పోటీలలో కూడా బుక్కరాయసముద్రం మండలం పేరు వినబడేటట్లు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. BKS-1 V/S BKS-4 సచివాలయాల మధ్య జరిగిన ఫైనల్ పోటీలలో ముందుగా టాస్ గెలిచి బికేస్-4 జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బి కే ఎస్-1 జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 రన్లు చేసింది. తరువాత బ్యాటింగ్ చేపట్టిన బి కే ఎస్-4 జట్టు 10 ఓవర్లు పూర్తి అయ్యేటప్పటికీ ఏడు వికెట్లు కోల్పోయి 72 రన్నులు మాత్రమే చేసింది .బి కేఎస్-1 35పరుగులతో విజయం సాధించింది . జనవరి 23 నుండి నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి బి కే యస్-1 అర్హత సాధించింది.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేష్ పంచాయితీ సెక్రటరీలు సాదిక్, మల్లికార్జున. సువర్ణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 13 2024, 06:45

పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.. రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..

పశువుల షెడ్లకు దరఖాస్తు చేసుకోండి.... రైతు సోదరులకు జడ్పీటీసీ నీలం భాస్కర్ విజ్ఞప్తి..మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈరోజు ఉదయం వ్యవసాయ కార్యాల యం లో శ్రీ పెద్ద కొండయ్య అధ్యక్ష్యతన జరిగినది.

ఈ సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ 2 పశువులు ఉన్న రైతులకు ఒక లక్ష రూపాయలు 4 పశువులు ఉన్న రైతులకు 1.5లక్ష రూపాయలు యస్సి ఎస్టీ రైతులకు 50% సబ్సిడీ వర్తిస్తుందని పశుస oవర్ధక కార్యాలయం ద్వారా సబ్సిడీ పై సరఫరా చేయుచున్న షెడ్లను ఆసక్తి అనువైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసారు.

అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య గారు మాట్లాడుతూ రైతులందరు రబి పంట నమోదు చేసుకోవాలని తెలియజేసారు.ఎ డి ఎ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటికే 128 మంది దరఖాస్తు చేసుకున్నారని రైతు దరఖాస్తు లను పరిశీలన చేసి ఆమోద్యాయోగమైన దరఖాస్థులను ఉన్నతధికారులకు పంపేదమని తెలియజేసారు. వ్యవసాయధికారి మాట్లాడుతూ పి యం కిసాన్ నిధులు 16వ విడత ఈ నెలలో విడుదల చేస్తారని 52 మంది రైతులు ekyc చేయుంచుకొని వారు ఉన్నారని మరియు NPCI లింక్ కానీ రైతులు 90 మంది ఉన్నారని రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు వారికి తెలియజేసారని ekyc NPCI చేయుంచుకొంటేనే డబ్బులు జమ అవుతాయని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో miao హరిత, రేకులకుంట లక్ష్మీనారాయణ రైతుభరోసా కేంద్ర ఇంచార్జి లు పాల్గొన్నారు. ఇట్లు యం. శ్యాం సుందర్ రెడ్డి మండల వ్యవసాయధికారి, బుక్కరాయసముద్రం మండలము.

Anantapur

Jan 13 2024, 06:36

కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరణ..

డిజిపి ఆఫీసు మంగళగిరి నందు రాష్ట్ర పోలీసు సంఘం EC మెంబర్ మరియు అనంతపురం 14వ బెటాలియన్ ప్రెసిడెంట్ పెద్దయ్య శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్,గారితో రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ని ఆవిష్కరించటం జరిగింది

ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది కి రావాల్సిన సరెండర్స్, టి.ఎ లు ప్రభుత్వం తో మాట్లాడి వేయిస్తాము అని చెప్పుతూ పోలీసు సిబ్బంది సమస్యలు గురించి రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘం రిప్రెంజెంటేషన్ ఇవ్వగా వెంటనే వాటి పరిష్కారానికి పైస్థాయి అధికారుల కమిటీ వేయటం జరిగింది

ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు కూడా ప్రభుత్వానికి పంపించి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది గౌరవ డిజిపి గారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు